శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): కొండా లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతి సందర్భంగా మొట్టమొదటి శేరిలింగంపల్లి నియోజకవర్గ తెలంగాణ ఉద్యమకారుడు ఎం.మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో లింగంపల్లిలోని విద్యానికేతన్ స్కూల్లో బాపూజీ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ సగర (ఉప్పర) సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, టీయూడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్, సీనియర్ పాత్రికేయుడు అమృత్ గౌడ్, నాయకులు ఎం.శివకుమార్, రామాచారి, విజయలక్ష్మి, రాజు యాదవ్, నర్సింగరావు, సంపత్, సాయి మురళి, సందీప్, శరత్, పట్వారి, చారి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.