శేరిలింగంపల్లి, జనవరి 12 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారి రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో, వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగ్ ముదిరాజ్, సురేష్ ముదిరాజ్, మహిళా అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి మక్తా మహబూబ్పేట డివిజన్లో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షుడిగా భట్టు రాజును నియమించారు. నూతనంగా నియమితులైన అధ్యక్షుడు భట్టు రాజు పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, డివిజన్ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మక్తమహబూబ్పేట డివిజన్లో భారీ సంఖ్యలో ప్రజలు టిఆర్పిలో చేరడం విశేషం. పార్టీలో చేరిన వారిలో పి. సరోజమ్మ, పీవీ రమణ, ఎస్కే అలిసాబ్, కమ్మరి వెంకటలక్ష్మి, ఎస్కే బిస్మిల్లా బేగం, పి.విజయ్ కుమార్, పీ మేఘన తదితరులు ఉన్నారు.






