శిల్పారామంలో అల‌రించిన నృత్య కార్య‌క్ర‌మం

మాదాపూర్, సెప్టెంబ‌ర్ 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా బెంగళూరు నుండి వ‌చ్చిన భరతనాట్య కళాకారులు సుమ ప్రభు బృందంచే నిర్వ‌హించ‌బ‌డిన భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది.

అంబా కామాక్షి, ఉమా మహేశ్వరి వర్ణం, కాళీ కౌత్వం అంశాలను సుమ ప్రభు, భార్గవి, పూజ, సింధు, హర్షితలు ప్రదర్శించారు. మీరా నాట్య నిలయం కుమారి పూజిత బంధువుల శిష్య బృందం భరతనాట్య ప్రదర్శనలో మూషిక వాహన, అష్టలక్ష్మి, నోటు స్వర, త్రిశ్ర అలరిపు, రంగపూజ నృత్య, మహాలక్ష్మి అష్టకం, స్వరజతి, ఆనంద నర్తన గణపతిమ్, గణేశా పంచరత్న, తిల్లాన అంశాలను క‌ళాకారులు వార్షిత, మనస్వి, భవిష్య, రాజనందిని, నిహిత, తనస్వి ప్రదర్శించి మెప్పించారు.

నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌తో అల‌రిస్తున్న క‌ళ‌కారులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here