శేరిలింగంపల్లి, ఏప్రిల్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్లోని శ్రీ ధర్మపురి క్షేత్రంలో వసంత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మూడవ రోజు తండవ నృత్య ఆకాడమి శిష్య బృందం ప్రదర్శించిన నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ సందర్భంగా కళాకారులను ధర్మపురి క్షేత్రం వ్యవస్థాపకురాలు భారతీయం సత్యవాణి ఘనంగా సన్మానించారు. కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని అన్నారు.






