శేరిలింగంపల్లి, ఏప్రిల్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ సర్కిల్ పరిధిలో 99 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ కమిషనర్ శశిరేఖ పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంవోహెచ్, డీఈఈ, ఏఈఈ, ఎస్డబ్ల్యూఎం, శానిటేషన్ సిబ్బంది, ఎంటమాలజీ సిబ్బంది, ఆర్పీలు పాల్గొన్నారు.






