ఎంఐజీలో రెపరెపలాడిన 75 జాతీయ జెండాలు – ఆనందభాష్పాలతో ఆవిష్కరించిన సీనియర్ సిటిజన్స్

నమస్తే శేరిలింగంపల్లి: హైదరాబాద్‌లోని బీహెచ్‌ఈఎల్ పాత ఎంఐజీ కాలనీలో స్వాతంత్ర్య ‌దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా‌ జరిగాయి. సీనియర్ సిటిజన్స్ ఆనంద బాష్పాలతో మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. ఒకటి కాదు రెండు‌ కాదు 75 జాతీయ జెండాలు ఎంఐజీ కాలనీలోని ఆయా ప్రాంతాలలో ఆవిష్కరించారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బీహెచ్ఈఎల్ పాత ఎంఐజీలోని 75 ప్రాంతాల్లో 75 జాతీయ‌ జెండాలను ఏర్పాటు చేసి 75 ఏళ్లకు పై బడిన 75 మంది సీనియర్ సిటిజన్స్ తో జాతీయ జెండాలను ఆవిష్కరింపజేశారు. తమ జీవితంలో మొట్ట మొదటిసారిగా జాతీయ జెండాను ఆవిష్కరింపజేసే అవకాశం వచ్చినందుకు సీనియర్ సిటిజన్స్ ఒకింత కన్నీటి పర్యంతమయ్యారు. వృద్ధ్యాప్య వయస్సులో దేశ భక్తి చాటుకునేలా జాతీయ జెండాను ఆవిష్కరింపజేసే అవకాశం కల్పించిన అరుణ్, డేనియల్, జైద్, సంతోష్, జాన్, నదీమ్, సన్నీ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

బీహెచ్ఈఎల్ పాత ఎంఐజీ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీనియర్ సిటిజన్స్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here