శేరిలింగంపల్లి, మే 11 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించగా డిప్యూటీ కమిషనర్ శశిరేఖ పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. టౌన్ ప్లానింగ్ విభాగానికి 2 ఫిర్యాదులు రాగా, ఇంజినీరింగ్ వింగ్కు 1 మొత్తం కలిపి 3 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఆయా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా ఆమె సంబంధిత శాఖల అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.






