శేరిలింగంపల్లి, ఆగస్టు 4 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని చందానగర్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 3 దరఖాస్తులను స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. ఇంజినీరింగ్ విభాగంలో 3 దరఖాస్తులు రాగా, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగం, హెల్త్ అండ్ శానిటేషన్, యూసీడీ వింగ్, ఇంజినీరింగ్ వింగ్, యూబీడీ, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఎలాంటి దరఖాస్తులు రాలేదు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు.






