నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలో ట్రాఫిక్ సమస్య లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు నుంచి నిజాంపేట్ వెళ్లే హై టెన్షన్ లైన్ రోడ్డులో ట్రాఫిక్ సమస్య నివారణ చర్యలపై ట్రాఫిక్ సిఐ సుమన్ తో కలసి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైటెన్షన్ లైన్ రోడ్డు లో తరచు ప్రమాదాలు జరుగుతున్న విషయాలపై స్థానికులు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ పోలీసులతో మాట్లాడి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గంగరాజు యాదవ్, చక్రవర్తి, రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, అవినాష్, సుశీల్, సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2022/04/IMG-20220404-WA0030.jpg)