ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కలిసిన జ్ఞానేంద్ర ప్రసాద్

నమస్తే శేరిలింగంపల్లి: భారతదేశ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని వెంకయ్యనాయుడిని నివాసంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆశీస్సులు తీసుకుని వినాయకుని ప్రతిమను బహుకరించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మాట్లాడినట్లు జ్ఞానేంద్ర ప్రసాద్ తెలిపారు. తాజా రాజకీయాలపై చర్చించి దేశ సేవ అభివృద్ధిలో బాధ్యత గల పౌరులుగా మెలగాలని సూచించినట్లు తెలిపారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here