ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ ధర్నా

నమస్తే శేరిలింగంపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుడిపై ధరల భారం మోపుతూ నానా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జెరిపాటి జైపాల్  అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఏఐసీసీ టీపీసీసీ పిలుపు మేరకు చందానగర్ గాంధీ విగ్రహం వద్ద ధరల పెంపును నిరసిస్తూ జేరిపెటి జైపాల్ ఆధ్వర్యంలో మెహంగాయి ముక్త్ భారత్ అభియాన్ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జెరిపాటి జైపాల్ మాట్లాడుతూ మోడీ పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం కరెంటు, ఆర్టీసీ చార్జీలను పెంచడం సరికాదన్నారు. రాబోయే రోజుల్లో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు ‌ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ నాయకుడు రవికాంత్ గౌడ్, శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు మహిపాల్ యాదవ్, ఇలాయస్ షరీఫ్, జావీద్ హుస్సేన్, మారేళ్ల శ్రీనివాస్, రేణుక, సురేష్, నాగేష్ నాయక్, జహంగీర్, అజీముద్దీన్, కాట నరసింహా గౌడ్, పోచయ్య, రాజేందర్, అల్లావుద్దీన్ పటేల్, ఖాజా, షేక్ పాషా, నల్లగండ్ల రమేష్, కార్తిక్ శామ్యూల్, ముత్యంరెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సౌందర్య రాజన్, శ్రీహరి గౌడ్, రాజేశ్ గౌడ, సాయి కిషోర్, ఖాజా, దుర్గా దాస్, మెహ్రాజ్ ఖాన్, విజయ్, కార్తిక్, సలీం, అసద్, తదితరులు పాల్గొన్నారు.

చందానగర్ లో నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here