ఆర్యవైశ్యుల పంచాంగాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ఆర్యవైశ్యుల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం‌ చేస్తున్న కృషి మరవలేనిదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. చందానగర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన శ్రీ శుభకృత్ నామ సంవత్సర 2022-23 పంచాంగంను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆవిష్కరించారు. తెలుగు నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ శాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పబ్బా మల్లేష్, జనరల్ సెక్రటరీ కేఎస్ సంపత్ కుమార్, ట్రెజరర్ జయకృష్ణ, సభ్యులు పబ్బా శ్రీనివాస్, సత్యనారాయణ, నాగరాజు, దినేష్, శ్రీధర్, భరత్, సుధీర్, కౌశిక్, మల్లికార్జున, శ్రీనివాస్, వాసవీ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, శ్రీనివాస్, గంప సత్యనారాయణ, నటరాజ్, సంతోష్ కుమార్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్యవైశ్య ఆధ్వర్యంలో రూపొందించిన పంచాంగంను ఆవిష్కరిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here