సరస్వతీ విద్యా మందిర్ కు లయన్స్ క్లబ్ విరాళం

నమస్తే శేరిలింగంపల్లి: సామాజిక సేవా కార్యక్రమాలు చేయడంలో లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుందని లయన్స్ క్లబ్ మెంబర్ లయన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని సరస్వతీ విద్యా మందిర్ ను లయన్స్ క్లబ్ మెంబర్స్ లయన్ శ్రీనివాస్ రెడ్డి, లయన్ ప్రతాప్ రెడ్డి, ఉషశ్రీ సందర్శించారు.ఈ సందర్బంగా పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం ఐదు కంప్యూటర్లు, ఐదు గ్రీన్ బోర్డులు విరాళంగా అందజేశారు. పాఠశాలను సందర్శించిన లయన్స్ క్లబ్ సభ్యులను పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సహ కార్యదర్శి రామచంద్రారెడ్డి, సభ్యులు గాల్ రెడ్డి, ప్రిన్సిపాల్ అరుణ పాల్గొన్నారు.

సరస్వతి విద్యా మందిర్ లో కంప్యూటర్లను విరాళంగా అందజేసిన లయన్స్ క్లబ్ సభ్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here