నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ లోని అన్ని సమస్యలను దశల వారీగా పరిష్కరించి అభివృద్ధిలో ముందుంచుతామని మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ లో బస్తీ స్థానిక నాయకులు,ప్రజలతో కలిసి సమావేశమయ్యారు. కాలనీలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పక్కా ప్రణాళికతో డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తున్నామని కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ చెప్పారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు పాటుపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ జనరల్ సెక్రటరీ సాంబశివ రావు, ఆదిత్య నగర్ బస్తి అధ్యక్షుడు మునఫ్ ఖాన్, సుభాష్ చంద్రబోస్ నగర్ బస్తీ అధ్యక్షుడు ముక్తర్, మాజీ అధ్యక్షులు ఖాసీం, మైనారిటీ అధ్యక్షులు రహీం, నాయకులు బాబూమియా, రెహ్మాన్, లియాకత్, సలీం, యూత్ అధ్యక్షులు ఖాజా, డాక్టర్ అఖిల్, యూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2022/03/IMG-20220327-WA0031.jpg)