నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని కాంట్రాక్టర్ల సమస్యలపై జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రత్యేక దృష్టి సారించింది. అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి కట్ల శేఖర్ రెడ్డి శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని కాంట్రాక్టర్లు పడుతున్న అవస్థలను అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి ప్రధాన కార్యదర్శి సురేందర్ సింగ్ ల దృష్టికి తీసుకువెళ్లారు. పెండింగ్ లో ఉన్న బిల్లులపై ప్రధానంగా చర్చించారు. సకాలంలో బిల్లులు రాక కాంట్రాక్టర్లు పడుతున్న అవస్థలను వారికి వివరించారు. అదేవిధంగా ఈ ఏడాది బిల్లులు సమర్పించే తుదిగడువును మార్చి 15 నుంచి మరికొంత కాలం పొడిగించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి సురేందర్ సింగ్, చీఫ్ ఇంజనీర్ జియావుద్దీన్ తో మాట్లాడి వీలైనంత త్వరగా సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు.