పెండింగ్ పనులను త్వరగా పూర్తిచేయాలి – చందానగర్ కార్పొరేటర్ మంజుల రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలో పెండింగ్ లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని స్థానిక కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. చందానగర్ సర్కిల్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కార్పొరేటర్ మంజుల రెడ్డి పలు సమస్యలపై చర్చించారు. డివిజన్ లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను సూచించారు. పెండింగ్ లో ఉన్న పనులను,‌ కొత్తగా చేపట్టబోయే పనులపై టెండర్ల పక్రియ ఎంత వరకు వచ్చిందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా ఆయా కాలనీలలో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో ఈఈ శ్రీకాంతి, డీఈ వాసంతి, ఏఈ, వర్క్ ఇన్‌స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులపై‌ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో మాట్లాడుతున్న కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here