నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి శేరిలింగంపల్లి నియోజకవర్గం కన్వీనర్ గా డిఎస్ఆర్ కె ప్రసాద్ ను నియమించాలని బిజెపి రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయి నాయకులు జిల్లా అధ్యక్షునికి విజ్ఞప్తి చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని బిజెపి నాయకులు మియాపూర్ నుంచి బయలుదేరి రంగారెడ్డి అర్బన్ జిల్లా బిజెపి కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డిని కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గ కన్వీనర్ గా డి ఎస్ ఆర్ కే ప్రసాద్ కి అవకాశం కల్పించాలని వినతి పత్రం అందజేశారు. ప్రసాద్ కు అవకాశం కల్పించి శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాషాయం జెండా ఎగురవేయాలన్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి గెలుపే ద్యేయంగా పనిచేస్తామన్నారు. పార్టీలోని నాయకులను సమన్వయం చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. సహాయ సహకారాలు అందిస్తున్న బిజెపి నాయకులు మొవ్వ సత్యనారాయణ, రవి కుమార్ యాదవ్, కసిరెడ్డి భాస్కర రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు త్రినాథ్, నియోజకవర్గ కో కన్వీనర్ అజిత్ కుమార్, రంగారెడ్డి జిల్లా ఓబిసి అర్బన్ సెక్రటరీ గంగల జంగయ్య యాదవ్, జిల్లా కార్యవర్గ సభ్యులు లీలా ప్రసాద్, మియాపూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శులు ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, రామకృష్ణారెడ్డి, శేరిలింగంపల్లి డివిజన్ ప్రధాన కార్యదర్శులు చిట్టా రెడ్డిప్రసాద్, ప్రశాంత్ చారి, మియాపూర్ డివిజన్ సెక్రెటరీ సాంబయ్య, చక్రపాణి, ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి పాపయ్య ముదిరాజ్, శ్రీధర్, ప్రసాద్, శివ, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
