విజేత సూపర్ మార్కెట్ ను ప్రారంభించిన నారా బ్రహ్మిణి

నమస్తే శేరిలింగంపల్లి: అంచలంచెలుగా ఎదుగుతూ అన్ని ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉండేలా విజేత సూపర్ మార్కెట్ బ్రాంచిలను ఏర్పాటు చేయడం అభినందనీయమని గోదావరి కట్స్ హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రహ్మణి అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాజరాజేశ్వరీ నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన విజేత సూపర్ మార్కెట్ ను గోదావరి కట్స్ హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రహ్మణి, స్థానిక ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీతో కలిసి ప్రారంభించారు. తన వ్యాపార రంగంలో దినదినాభివృద్ధి చెందుతూ విజయాలను దక్కించుకుంటున్న విజేత సూపర్ మార్కెట్ సంస్థ జగన్ మోహన్ రావును నారా బ్రహ్మణి ప్రత్యేకంగా అభినందించారు. ఈ‌ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపార వేత్త మాగంటి రూప, కార్పొరేటర్లు హమీద్ పటేల్, ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావు తో పాటు విజేత సూపర్ మార్కెట్ సంస్థ ఛైర్మన్ జగన్ మోహన్ రావు, మాజీ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజ్, హోప్ ఫౌండేషన్ ఛైర్మన్ కొండా విజయ్, కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు కృష్ణ గౌడ్, నాయకులు చాంద్ పాషా, రమేష్, బలరాం యాదవ్, తిరుపతి, వెంకటేశ్వర్లు, బాబ్జి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here