ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తే చర్యలు తప్పవు – శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే సహించేది లేదని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హెచ్చరించారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గచ్చిబౌలిలోని స్మశాన వాటిక ప్రక్కన ఉన్న సర్వేనెంబర్ 136 స్థలాన్ని కబ్జాకు ప్రయత్నిస్తున్నారనే విషయం తెలుసుకున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్థానికులతో కలిసి ఆ స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తే చర్యలు తప్పవని రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. ప్రజలకు ఉపయోగపడేలా ఆ స్థలంలో సంక్షేమ‌ భవనం నిర్మించేలా చూడాలని గచ్చిబౌలి గ్రామ కమిటీ సభ్యులు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత అధికారులతో మాట్లాడి కబ్జాకు ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు‌. చుట్టూ ఫెన్సింగ్ వేసి కబ్జా కాకుండా కాపాడాలని అన్నారు. అదేవిధంగా గ్రామంలోని స్మశాన వాటికను అభివృద్ధి చేసి మహాప్రస్థానం గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బస్తి కమిటీ అధ్యక్షుడు నయీం, నందు సింగ్, రాజు, భుమన్ శ్రీనివాస్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.

గచ్చిబౌలి గ్రామంలో పర్యటిస్తున్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here