యూజీడీ పనులను పరిశీలించిన కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలో దోబీ ఘాట్ లో నూతనంగా చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ఆదివారం కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పరిశీలించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు అవసరమయ్యే‌ కనీస వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని అన్నారు. యూజీడీ, రోడ్లు, మంజీరా మంచినీటి పైపులైన్ పనులు తదితర అభివృద్ధి పనులను దశల వారీగా చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు సయ్యద్ గౌస్, బస్తి నాయకులు రాందాస్, రాంజనేయులు, ఉన్నుర్, యువకులు హరీష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

యూజీడీ పనులను పరిశీలిస్తున్న మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here