ప్రతిభ గల విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆప్ హోప్ చేయూత

నమస్తే శేరిలింగంపల్లి: మంచి నైపుణ్యాలతో ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆప్ హోప్ హైదరాబాద్ అండగా ఉంటుందని క్లబ్ అధ్యక్షుడు ‌కొండా విజయ్ కుమార్ అన్నారు. సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న హఫీజ్ పేట కు‌ చెందిమ రెబ్బ వైభవి అనే విద్యార్థినీకి లయన్స్ క్లబ్ ఆప్ హోప్ హైదరాబాద్ రూ. 20 వేల ఆర్థిక సహాయం అందజేశారు. విద్యతో పాటు క్రీడల్లో రాణించే వారికి ప్రోత్సాహకాలను అందజేస్తున్నట్లు కొండా విజయ్ కుమార్ అన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి మారం వెంకట్, శాంతి భూషణ్ రెడ్డి, రెడ్డి ప్రవీణ్ రెడ్డి, మారం ప్రసాద్ తో పాటు విద్యార్థిని తల్లి వరలక్ష్మి పాల్గొన్నారు.

ఇంజనీరింగ్ విద్యార్థినీకి రూ.20 వేల ప్రోత్సహాకాన్ని అందజేస్తున్న కొండా విజయ్ కుమార్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here