గొప్ప పరాక్రమవంతుడు శివాజీ మహారాజ్ – ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ 392 జయంతి ఉత్సవాలు

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజవర్గంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 392 వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. హాఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని గంగారాం గ్రామంలో యూత్ నాయకులు మల్లికార్జున్, యువకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి మహోత్సవంలో మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఛత్రపతి శివాజీని నేటి యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ భారతీయుల సంరక్షణకు యుద్ధాలు చేసిన మహావీరుడన్నారు. నేటి యువత ఛత్రపతి శివాజీ మహారాజ్ ను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శేఖర్ ముదిరాజ్, రవి కుమార్, యూత్ సభ్యులు రోహిత్, శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఛత్రపతి శివాజీ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న కార్పొరేటర్ జగదీశ్వర్ 

కొండాపూర్ డివిజన్ లో..‌

కొండాపూర్ డివిజన్ సిద్దిక్ నగర్ లో కైల రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బిజెపి రంగారెడ్డి అర్బన్ యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి జితేందర్, మాదాపుర్ డివిజన్ ప్రెసిడెంట్ ఆనంద్, స్థానిక జై మాతా ది యూత్ సభ్యులు రవీందర్ రెడ్డి, సదర్ రాము, నవాజ్ యాదవ్, సతీష్, సోమేశ్వర, గగన్, వినయ్, నాయుడు పాల్గొన్నారు.

సిద్దిఖ్ నగర్ లో శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను నిర్వహిస్తున్న బిజెపి నాయకులు

భేరి రాంచందర్ యాదవ్ ఆధ్వర్యంలో…
చత్రపతి శివాజీ మహారాజ్ అడుగుజాడల్లో నడవాలని యువత నడవాలని నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ అన్నారు. ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్ చత్రపతి శివాజీ మహారాజ్ కి ఘనంగా నివాళి అర్పించారు. చత్రపతి శివాజీ గొప్ప దేశభక్తుడని, గొప్ప పరాక్రమవంతుడు అని రాంచందర్ యాదవ్ అన్నారు. చత్రపతి శివాజీ ఆదర్శంగా తీసుకొని దేశాభివృద్ధి పట్ల, సమాజం పట్ల బాధ్యతగా మెలగాలని సూచించారు. గొప్ప గొప్ప వ్యక్తుల ను అనుసరించడం వల్ల దేశం గొప్పగా మారుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ చత్రపతి శివాజీ అడుగుజాడల్లో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రాయుడు, కే నరసింహ యాదవ్, ప్రభాకర్ చారి, శ్రీకాంత్, యూత్ ప్రధాన కార్యదర్శి భవన్ డీజే, నాగరాజ్, సాయి తేజ, అశోక్, బాలస్వామి, వెంకటేష్ మేస్త్రి, కొండలరావు మేస్త్రి గోపాల్ యాదవ్, ప్రభాకర్ యాదవ్, కాలనీ పెద్దలు, యువజన నాయకులు పాల్గొన్నారు.

నేతాజీ నగర్ లో శివాజీ జయంతి వేడుకలను నిర్వహించిన భేరి రాంచందర్ యాదవ్

చందానగర్ డివిజన్ లో…
చందానగర్ డివిజన్ పరిధిలోని గాంధీ విగ్రహం వద్ద టిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు కృష్ణ దాస్ ఆధ్వర్యంలో శివాజీ జయంతి వేడుకలను నిర్వహించారు. చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి పాల్గొని ఛత్రపతి శీవాజి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ దేశ సంరక్షణకు ఎన్నో యుద్ధాలు చేసిన మహావీరుడని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గురుచరణ్, పబ్బా మల్లేష్, పులిపాటి నాగరాజు, రవీందర్ రెడ్డి, ప్రవీణ్, కార్తీక్ గౌడ్, యశ్వంత్, కొండల్ రెడ్డి, దీక్షిత్ రెడ్డి, ఉదయ్, అమిత్, తదితరులు పాల్గొన్నారు.

చందానగర్ గాంధీ విగ్రహం వద్ద ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న రఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here