యూజీడీ పైపులైన్లకు ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ శంకుస్థాపన

నమస్తే శేరిలింగంపల్లి:  నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామ‌ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని అపర్ణ టవర్స్ లో కోటి 20 లక్షల నిధుల వ్యయంతో చేపట్టనున్న యూజీడీ పైపులైన్ నిర్మాణానికి స్థానిక కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, జలమండలి అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి కాలనీ, బస్తీ అభివృద్దే లక్ష్యంగా పక్క ప్రణాళికతో ముందుకు సాగుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్, జలమండలి జీఎం రాజేశ్వర్, డీజీఎం శ్రీమన్నారాయణ, మాదాపూర్, హఫీజ్ పేట్ డివిజన్ల టీఆర్ఎస్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బాలింగ్ గౌతమ్ గౌడ్, హాఫీజ్ పెట్ డివిజన్ గౌరవ అధ్యక్షులు వాలా హరీష్ రావు, వార్డు సభ్యులు కనకమామిడి వెంకటేష్ గౌడ్, వాజిర్, మేనేజర్ ఇల్వర్తి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

యూజీడీ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here