బాధిత కుటుంబానికి అండగా నిలిచిన రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీ లో షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైన ఇంటిని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ పరిశీలించారు. ఈ ప్రమాదంలో ఇంట్లోని బట్టలు, నిత్యావసర వస్తువులు, సామాన్లు దగ్ధమవడంతో రోడ్డున పడ్డ కుటుంబ సభ్యులకు తాము అండగా ఉంటామని రవికుమార్ యాదవ్ అన్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆర్ కే వై టీం ద్వారా బాధిత కుటుంబ సభ్యులకు కావాల్సిన అత్యవసర వస్తువులను దగ్గరుండి సమకూర్చాలని టీమ్ సభ్యులకు రవికుమార్ యాదవ్ సూచించారు. స్థానిక రెవెన్యూ సిబ్బందితో మాట్లాడి నష్టపరిహారాన్ని ఇప్పిస్తామని కుటుంబానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, గణేష్ ముదిరాజ్, వినోద్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, మల్లేష్, శ్రీను, రాము, విజేందర్, గోపి తదితరులు పాల్గొన్నారు.

అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధిత‌ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేస్తున్న రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here