కుమ్మరి బస్తీలో బస్తీ బాట చేపట్టిన బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: యూజీడీ, మ్యాన్ హోల్స్ సరిగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ అన్నారు. బస్తీబాటలో భాగంగా మాదాపూర్ గ్రామం కుమ్మరి బస్తి లో బీజేపీ నాయకులు, స్థానికులతో కలిసి సోమవారం బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ పర్యటించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత రెండు సంవత్సరాలుగా డ్రైనేజీ పొంగుతుండడం, మ్యాన్ హోల్స్ ప్రమాదకరంగా మారడంతో నిత్యం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు ప్రజలు వాపోయారు. ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ కుమ్మరి బస్తీలో ఎక్కడ చూసినా సమస్యలే ఉన్నాయని, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం, మ్యాన్ హోల్స్ పై కప్పులు తెరుచుకుని ఉండడంతో చిన్న పిల్లలు ప్రమాదభారిన పడే అవకాశం ఉందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమస్యల పరిష్కారానికి ‌కృషి చేయకపోవడం విడ్డూరమన్నారు. సంబంధిత అధికారులకు ఫోన్‌ లో మాట్లాడి బస్తీకి రప్పించి సమస్యను పరిష్కరింపజేశారు. అనంతరం స్థానిక టీఆర్ఎస్ నాయకుడు గోపాల్ ముదిరాజ్ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు ఆకర్శితులై రవి కుమార్ యాదవ్ నేతృత్వంలో బిజెపిలోకి చేరారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు సాగర్, రాధా కృష్ణ యాదవ్, వెంకటేష్ యాదవ్, నర్సింగ్ టాకుర్, శాస్త్రి యాదవ్, అశోక్, లాలన్న, చండప్ప, గోపాల్ ముదిరాజ్, యాదయ్య, గోవర్ధన్ రెడ్డి, శివ, నాగార్జున, మంజునాథ్, శ్రీను, రవి ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.

కుమ్మరి బస్తీలో బస్తీబాట చేపడుతున్న బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here