మహాత్ముని అడుగుజాడల్లో పయనిద్దాం – చందానగర్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: జాతిపిత మహాత్మాగాంధీజీ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి తెలిపారు. మహాత్మ గాంధీ వర్థంతిని పురస్కరించుకుని చందానగర్ డివిజన్ పరిధిలోని గాంధీ విగ్రహానికి చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ గాంధీజీ జీవితం యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మహాత్ముని పోరాట స్ఫూర్తిని, నడచిన మార్గాన్ని అందరూ ఆచరించాలని సూచించారు. కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు లక్ష్మీనారాయణ గౌడ్, జనార్దన్ రెడ్డి, ధనలక్ష్మి, రవీందర్ రెడ్డి, మల్లేష్, ఓ వెంకటేష్, అంజద్ పాషా, వరలక్ష్మి రెడ్డి, పార్వతి, కొండల్ గొరుగూరురెడ్డి, కుమార్, యశ్వంత్, బాబు తదితరులు పాల్గొన్నారు.

చందానగర్ గాంధీ విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here