శ్రీనివాస రామానుజన్ ను ఆదర్శంగా తీసుకుని నూతన ఆవిష్కరణలు‌ చేయాలి – మదీనగూడ నారాయణ పాఠశాల ప్రిన్సిపాల్ రాధిక

నమస్తే శేరిలింగంపల్లి: గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ జన్మదిన వేడుకలను నారాయణ ఉన్నత పాఠశాల మదీనగూడలో బుధవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ రాధిక, ఉపాధ్యాయులు, విద్యార్థులు రామానుజన్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రాధిక మాట్లాడుతూ మాట్లాడుతూ గణిత శాస్త్రం లో అపారమైన మేధస్సుతో భారతదేశపు కీర్తిని ప్రపంచ గణిత శిఖరాలపై ఎగరవేసిన మహా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ అని అన్నారు. పన్నెండేళ్ల వయస్సులోనే అపారమైన మేధస్సుతో అసాధారణ బాలునిగా గుర్తింపు పొందారని అన్నారు. విద్యార్థులందరూ రామానుజన్ ను అదర్శంగా తీసుకుని నూతన ఆవిష్కరణలు చేయాలన్నారు. అనంతరం విద్యార్థులకు ఫజిల్స్, ట్రెజర్ హంట్, క్విజ్ తదితర పోటీ ‌కార్యక్రమాలను నిర్వహించారు. రామానుజ‌న్ చరిత్రను బుర్రకథ రూపంలో చక్కటి ప్రదర్శన చేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here