ఉక్కు మనిషి సర్దార్ వల్లాబాయ్ పటేల్ – బిజెపి రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: హైదరాబాద్ విమోచన కారకుడు, నిజాం నిరంకుశత్వానికి చరమగీతం పాడిన జాతీయ వాది సర్దార్ వల్లాబాయ్ పటేల్ ను దేశం ఎన్నటికీ మరిచిపోలేదని బిజెపి రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర రెడ్డి అన్నారు. సర్దార్ వల్లాబాయ్ పటేల్ వర్థంతిని పురస్కరించుకుని బుధవారం ఆయన చిత్రపటానికి కసిరెడ్డి భాస్కర రెడ్డి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి సర్దార్ పటేల్ చేసిన సేవలు ఎనలేనివని అన్నారు. దేశాన్ని ఒక్కటిగా ఉంచడం కోసం ఉక్కు సంకల్పంతో పని చేసి ఉక్కు మనిషి గా పేరొందారని అన్నారు. ఆయన తీసుకునే నిర్ణయాలు దేశహితమైనవిగా ఉండేవని కసిరెడ్డి భాస్కర రెడ్డి అన్నారు. సర్దార్ పటేల్ లాంటి నాయకత్వం నేడు ప్రధానమంత్రి మోదీలో కనిపిస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర సైనికుల విభాగం జాయింట్ కన్వీనర్ నాగం రాజశేఖర్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరి త్రినాథ్, రంగారెడ్డి జిల్లా అర్బన్ నార్త్ ఇండియన్ సెల్ కన్వీనర్ రాజ్ జైశ్వాల్, రమేష్, రాజేందర్ రెడ్డి, కిషన్, ఆశిష్ కుమార్ గుప్త తదితరులు పాల్గొన్నారు.

సర్దార్ వల్లాభాయ్ పటేల్ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న కసిరెడ్డి భాస్కర రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here