నమస్తే శేరిలింగంపల్లి: చిన్నతనం నుంచే పిల్లలను క్రీడల పట్ల ఆసక్తి కనబరిచేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి తెలిపారు. చందానగర్ డివిజన్ పరిధిలోని పీజేఆర్ స్టేడియంలో వీఆర్ జిమ్నాస్టిక్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన జిమ్నాస్టిక్ చాంపియన్ షిప్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పాల్గొని విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ చాంపియన్ షిప్ లో అండర్ 6, అండర్ 8, అండర్ 10, అండర్ 12, అండర్ 14 లో ఏర్పాటు చేసిన జిమ్నాస్టిక్ క్రీడల్లో క్రీడా కారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టిందని అన్నారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల్లో రాణించేలా శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి గారు వీఆర్ జిమ్నాస్టిక్ అకాడమీ సభ్యులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.