కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలి: తుకారాం నాయక్

నమస్తే శేరిలింగంపల్లి: కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రాను వెంటనే పదవి నుండి తొలగించి, ఆయన కుమారుడు ఆశిష్ మిశ్రా ను వెంటనే అరెస్టు చేయాలని ఎంసీపీఐయూ గ్రేటర్ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి వి తుకారాం నాయక్ డిమాండ్ చేశారు. ఎంసీపీఐ యూ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఉత్తర ప్రదేశ్ లో తికునియా లో జరిగిన మారణహోమానికి నిరసనగా ముజఫర్ అహ్మద్ నగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంసీపీఐ యూ ఆధ్వర్యంలో సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తుకారాం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని శాంతియుతంగా నిరసన తెలిపిన రైతులపై దాడి చేయడం‌ అమానుషమన్నారు. ఈ దాడుల్లో ముగ్గురు రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆవేధన చెందారు. కేంద్ర హోంశాఖ మంత్రి అజయ్ మిశ్రా హోదాను అడ్డుపెట్టుకుని ఇలాంటి అమానవీయ సంఘటనకు పాల్పడ్డ ఆయన కుమారుడు ఆశిష్ మిశ్ర ను వెంటనే అరెస్టు చేయాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏ ఐ సి టి యు రాష్ట్ర అధ్యక్షుడు తుడుం అనిల్ కుమార్, ఏ ఐ ఎఫ్ డి వై రాష్ట్ర నాయకులు డి మధుసూదన్, బి.రవి వెంకటేష్, సుల్తానా బేగం, ఏఐ ఎఫ్ డిడబ్ల్యూ రాష్ట్ర నాయకులు విమల, లావణ్య, తుడుం పుష్పలత, నాయకులు ఈశ్వరమ్మ, రజియా బేగం, శ్రీలత చైతన్య, ఇందిరా, పద్మ, విజయ, రమా, సుమలత తదితరులు పాల్గొన్నారు.

నిరసన తెలుపుతున్న ఎంసీపీఐయూ నేతలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here