మియాపూర్ లో త్వరలోనే టీఆర్ఎస్ బస్తీ కమిటీలు: కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో బస్తీ కమిటీల ఏర్పాటు విషయమై మంగళవారం కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పనిచేయాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ జి రంజిత్ రెడ్డి, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సారథ్యంలో మియపూర్ డివిజన్ పరిధిలోని టీఆర్ఎస్ పార్టీ బస్తీ, కాలనీల కమిటీలను త్వరలో వేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు పురుషోత్తం యాదవ్, అన్వర్ షరీఫ్, బిఎస్ఎన్ కిరణ్ యాదవ్, గోపరాజు శ్రీనివాస్, మాధవరం గోపాల్ రావు, గంగాధర్ రావు, ప్రతాప్ రెడ్డి, మహేందర్ ముదిరాజ్, మహ్మద్ ఖాజా, జహంగీర్, అశోక్, చంద్రిక ప్రసాద్ గౌడ్, కలిదిండి రోజా, సుప్రజ తదితరులు పాల్గొన్నారు.

ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడుతున్న కార్పొరేటర్ ఉప్పలపాటి‌ శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here