ఆంజనేయ స్వామి విగ్రహానికి వెండి కిరీటం బహుకరించిన రాగం దంపతులు

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని హుడా ట్రెడ్ సెంటర్ సీతారామాంజనేయ స్వామి వారి ఆలయంలో కొలువైన ధ్యానాంజనేయ స్వామి విగ్రహానికి స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ దంపతులు వెండి కిరీటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు మాజీ చైర్పర్సన్ రాగం సుజాత యాదవ్, ఆలయ కమిటీ నిర్వాహకులు స్వామిజీ శివరామ చంద్రమూర్తి, హుడా ట్రేడ్ సెంటర్ కాలనీ అధ్యక్షుడు కుకునూరి శ్రీనివాస్ గౌడ్, కమిటీ సభ్యులు బుచ్చిరెడ్డి, కోటేశ్వరరావు, మహేష్ గౌడ్, పవన్ కుమార్, సత్యనారాయణ, సుమన్, యువ నాయకులు రాగం అనిరుద్ యాదవ్, రాగం అభిషేక్ యాదవ్, గోపినగర్ బస్తీ కమిటీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, పట్లోళ్ల నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆంజనేయ స్వామికి వెండి కిరీటాన్ని బహుకరిస్తున్న రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here