సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం – అల్విన్ కాలనీలో పర్యటించిన ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ఆల్వి‌న్ కాలనీలో మంగళవారం మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాదయాత్ర చేశారు. కాలనీలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు స్థానికులు కాలనీలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే, కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. దశల వారీగా తప్పకుండా వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అల్విన్ కాలనీ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, నాయకులు కృష్ణ ముదిరాజ్, కిషన్ రావు, శ్రీకాంత్ రెడ్డి, పురుషోత్తం యాదవ్, హఫీజ్ పేట్ డివిజన్ గౌరవ అధ్యక్షుడు వాలా హరీష్ రావు, లక్ష్మ రెడ్డి, రవీందర్ రెడ్డి, ఎస్.వి రమణ, మల్లేష్, నాగభూషణం, విఘ్నేశ్వర రెడ్డి, విజయ్ కుమార్, రాజేశ్వర రావు, సంజీవ్ రెడ్డి, సుదర్శన్ రాజు, వెంకటేశ్వర రావు, సాంబశివ రెడ్డి, రాజ ధర్మా రెడ్డి, నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.

అల్విన్ కాలనీ వాసులతో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ గాంధీ

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here