శిశు మంగళ్ అనాథాశ్రమంలో నిత్యావసర సరుకులు పంపిణీ

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల శిశు మంగళ్ అనాధ ఆశ్రమంలో సురేష్ జన్మదినం సందర్భంగా వివేకానంద సేవ సమితి గౌరవ అధ్యక్షుడు జ్ఞానేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా పుస్తకాలు, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ విద్యతో పాటు దృఢమైన ఆరోగ్యాన్ని అలవర్చుకోవాలని సూచించారు. విద్య విషయంలో అనాధ పిల్లలకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్క యువత సేవా భావాన్ని అలవర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అశోక్, సందీప్, రవి, తేజ తదితరులు పాల్గొన్నారు.

అనాథాశ్రమంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేస్రున్న సురేష్, జ్ఞానేంద్ర ప్రసాద్

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here