అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు వచ్చేలా చూస్తాం: ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని జె పి నగర్ లోని కళ్యాణమండపంలో పలుకాలనీలకు సంబంధించిన లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులను బుధవారం మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆదేశాల మేరకు కొత్త రేషన్ కార్డులను పేద ప్రజలకు అందజేయడం ఎంతో సంతృప్తినిస్తుందని అన్నారు. అర్హులైన పేదలకు రేషన్ కార్డు వచ్చే విధంగా కృషి చేస్తానని, అదేవిధంగా రేషన్ దుకాణాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేస్తామని డివిజన్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు అన్నిరాజు,రేషన్ డీలర్లు అమర్‌నాథ్, వెంకటేష్, యాదయ్య గౌడ్, రాజేష్, వీరసింగ్, టీఅర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

జెపి నగర్ లో ఆహారభద్రత కార్డులను అందజేస్తున్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here