రేషన్ కార్డులను పంపిణీ చేసిన కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్, వార్డ్ కార్యాలయంలో అర్హులైన 700 మంది లబ్దిదారులకు బుధవారం స్థానిక కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదల కోసం చేపట్టిన నూతన రేషన్ కార్డుల ద్వారా ఈ నెల నుంచే నిత్యావసర సరుకులను తీసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కృష్ణ, నాగేశ్వర రావు, సంజీవ్ రెడ్డి, ఏ.కే.బాలరాజు, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, జనరల్ సెక్రెటరీ సాంబశివ రావు, ఆదిత్య నగర్ టీఆర్ఎస్ బస్తి అధ్యక్షుడు ఖాసిం, శంకర్ రావు, కృష్ణ కాలనీ టీఆర్ఎస్ బస్తి అధ్యక్షుడు కృష్ణ యాదవ్, సుభాష్ చంద్ర బోస్ నగర్ టీఆర్ఎస్ బస్తి అధ్యక్షుడు ముక్తార్, మాతృ శ్రీ నగర్ కాలనీ అధ్యక్షుడు అనిల్ కావూరి, వార్డ్ సభ్యులు రహీమ్, రాంచందర్, శ్రీనివాస్, నాయకులు శాస్త్రి యాదవ్, రామ్మోహన్, మైనారిటీ నాయకులు బాబుమియా, లియకత్, మునాఫ్ ఖాన్, సాంబయ్య, ఓ.కృష్ణ, శ్యామ్, ప్రభాకర్, ప్రకాష్ రెడ్డి, రాములు యాదవ్, రామకృష్ణ, జాఫర్, తైలి కృష్ణ, కేశవులు, రంగస్వామి, రామకృష్ణ, యూత్ అధ్యక్షుడు ఖాజా, మల్లారెడ్డి, సత్తి రెడ్డి, స్వామి, హుసేన్, లోకేష్, ఆఫ్రోజ్, సర్దార్, శ్రీనివాస్ నాయక్, రేషన్ డీలర్లు మహేష్, అల్తాఫ్ ఖాన్, చైతన్య, ప్రవీణ్, మహిళలు రాణి,ఉమాదేవి,పర్వీన్ తదితరులు పాల్గొన్నారు.

మాదాపూర్ లో రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్న కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here