తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలి

  • సెల్లార్ తీసిన బిల్డర్ కు ప్రభుత్వ విప్ గాంధీ ఆదేశం
  •  కూలిన అపార్ట్ మెంట్ ప్రహరీ.. హుటాహుటిన పర్యటించిన గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: వరుసగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వర్టెక్స్ ఏజెన్సీ చేపట్టిన భారీ బహుళ అంతస్తుల సెల్లార్ నిర్మాణం వల్ల పక్కనున్న అపార్ట్ మెంట్ ప్రహరీ కూలిపోయింది. శేరిలింగంపల్లి నియోజకవర్గం, గచ్చిబౌలి డివిజన్, నల్లగండ్ల ఫ్లైఓవర్ దగ్గర శ్రావ్య – స్వాతిక అపార్ట్ మెంట్, ఆపిల్ లల్లి అపార్ట్ మెంట్ ను ఆనుకోని ఉన్న ఒక అపార్ట్ మెంట్ లో జరిగింది.

విషయం తెలిసిన వెంటనే కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, జిహెచ్ ఎంసి అధికారులతో కలిసి హుటాహుటిన అర్థరాత్రి సంఘటన స్థలానికి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ వెళ్లి పరిశీలించి, అపార్ట్ మెంట్ వాసులకు తామున్నామని భరోసా కల్పించారు, సహాయక చర్యలలో పాల్గొన్నారు. సెల్లార్ తీసిన బిల్డర్ తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని, అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని, బారికేడ్లు ,ఇసుక బస్తాలు వేసి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని హెచ్చరించారు.

ప్రజలకు కాలనీ వాసులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని బిల్డర్ కి ఆదేశాలిచ్చారు. చిన్న పిల్లలు, పెద్దలు, కాలనీ వాసులు అటు వైపు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, స్వీయ రక్షణ చర్యలు పాటించాలని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ ఎంసి అధికారులు ఈఈ శ్రీనివాస్, ఎఈ సునీల్, అపార్ట్ మెంట్ వాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here