క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోవాలి

  • సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్దిక్ నగర్, రాఘవేంద్ర కాలనీల్లో జరిగిన క్రిస్టమస్ వేడుకల సందర్భంగా సెమి క్రిస్టమస్ వేడుకలు అంబరాన్నంటాయి. ఈ వేడుకలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని క్రిస్టమస్ కేక్ కట్ చేసి, క్రిస్టియన్ సోదరి సోదరమణులకు ముందస్తు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు.

కొండాపూర్ డివిజన్ పరిధిలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ప్రార్థనల్లో చేస్తున్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ఏసుప్రభు కృప వల్ల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, క్రిస్మస్ సంబరాలను ఘనంగా నిర్వహించుకోవాలని, ప్రతి ఒక్కరూ సంతోషంగా పండుగను జరుపుకోవాలని, ఎంతో పవిత్రంగా భావించే క్రిస్మస్ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని, క్రిస్టమస్ కేక్ కట్ చేసి క్రిస్మస్ సోదర సోదరిమనులకు మరోసారి శుభాకాంక్షలు తెలిపారు. అర్హులైన ప్రతి పేద వారికీ అనేక సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు.

వేడుకల్లో పాల్గొన్ఎన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తిరుపతి రెడ్డి, గణపతి, బస్వరాజు పాస్టర్లు టిఆర్ రాజు, జర్మయ్య, క్రిస్టియన్ సోదరి, సోదరమణులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here