వివేకానందనగర్(నమస్తే శేరిలింగంపల్లి): వివేకానందనగర్ డివిజన్ బిజెపి కార్పొరేటర్ అభ్యర్థి ఉప్పల విద్యకల్పన ఏకాంత్గౌడ్ దంపతులు ఆదివారం కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. బల్దియా ఎన్నికల్లో డివిజన్లో టీఆర్ఎస్కు గట్టి పోటి ఇవ్వడం పట్ల కిషన్రెడ్డి వారిని అభినందించారు. ఇదే స్పూర్తితో డివిజన్లో పార్టీ అభివృద్ధికి కృషిచేయాలని సూచించారు. 2023లో రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వ స్థాపన కోసం ప్రతి కార్యకర్త కంకణబద్దులై పనిచేయాలని అయన పిలుపునిచ్చారు. కిషన్రెడ్డిని కలిసిన వారిలో శృతి శ్రీకాంత్గౌడ్, హితెశ్వరి, వెంకట్ స్వామి రెడ్డి, సుబ్బారెడ్డి,వీర్రాజు గౌడ్, పుష్పెందర్, భాస్కర్, మహేష్ గౌడ్, తదితరులు ఉన్నారు.