నాణ్యమైన విద్యనందించాలి

  • కిడ్జీ ప్రీ స్కూల్ ను ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ నలగండ్లలో నూతనంగా ఏర్పాటు చేసిన కిడ్జీ ప్రీ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రవి, కావ్య దంపతుల ఆహ్వానం మేరకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇన్చార్జి రవికుమార్ యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.

జ్యోతి ప్రజ్వలన చేసి స్కూల్ ని ప్రారంభిస్తున్న రవికుమార్ యాదవ్

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్కూల్ ఏర్పాటు చేసిన రవి, కావ్యలకు అభినందనలు తెలిపారు. పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తూ, విద్యతో పాటు సంస్కృతి, సంప్రదాయాలను, ఇప్పటి నుండే నేర్పించాలని కోరారు. పలు శాఖలను ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు.

రవికుమార్ యాదవ్ కు సన్మానం

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు గొల్ల నిరంజన్ యాదవ్, బిజెపి జిల్లా అధికార ప్రతినిధి చల్లా వేణుగోపాల్ యాదవ్, నల్లగండ్ల గూడ కాలనీ ప్రెసిడెంట్ జలంధర్, కాలనీ అసోసియేషన్ సభ్యులు, స్కూల్ యాజమాన్యం సిబ్బంది, తల్లిదండ్రులు పిల్లలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here