జంట సర్కిళ్లలో మందకొడిగా సాగుతున్న పోలింగ్

  • మొదటి రెండు గంటల్లో నాలుగు శాతం కన్నా తక్కువే
తొమ్మిది గంటల వరకు పోలైన ఓట్ల వివరాలు

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి జంట సర్కిళ్లలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఎప్పటిలాగానే తొలి రెండు గంటల్లో పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు పెద్దగా కనిపించలేదు. ఓ వైపు కరోనా, మరోవైపు చలి ప్రభావం కారణాలుగా తెలుస్తున్నాయి. సామాజిక దూరం పాటిస్తూ ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల్లో పాల్గొంటున్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరినప్పటికీ మరి కొన్ని కేంద్రాలు ఓటర్లు లేక వెలవెల బోతున్నాయి. సర్కిల్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 7 గం. నుండి 9 గం. ల వరకు చందానగర్ సర్కిల్ పరిధిలోని మాదాపూర్ డివిజన్ లో 3.5, మియాపూర్ డివిజన్ లో 3.58, హఫీజ్ పేట్ డివిజన్ లో 3.94, చందానగర్ డివిజన్ లో 5.11 శాతం నమోదు కాగా సర్కిల్ సరాసరి పోలింగ్ శాతం డివిజన్లలో కలిపి సరాసరి పోలింగ్ శాతం 4.04 గా ఉంది. శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని కొండాపూర్ డివిజన్ లో 2.13, గచ్చిబౌలి డివిజన్ లో 3.77, శేరిలింగంపల్లి డివిజన్ లో 4.18 శాతం నమోదు కాగా సర్కిల్ సరాసరి పోలింగ్ శాతం 3 .52 గా ఉంది.

గోపి నగర్ లో ఓ పోలింగ్ కేంద్ర వద్ద బారులు తీరిన ఓటర్లు
ఓటర్లు లేక వెలవెలబోతున్న పోలింగ్ కేంద్రం
ఓటు హక్కును వినియోగించుకున్న 98 ఏళ్ళ ఎద్దు ఈశ్వరమ్మ
ఓటర్లకు పోలింగ్ కేంద్రాల వద్ద సహకారం అందిస్తున్న పలు పార్టీల నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here