నమస్తే శేరిలింగంపల్లి : జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంఛార్జి డాక్టర్ మాధవరెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు రంగవల్లికల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశేషంగా మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాధవరెడ్డి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు భవిష్యత్తు తరానికి తెలియజేసేందుకు పోటీలు నిర్వహిస్తున్న ట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలుగా పాల్గొన్న సుజాత కాజా, ప్రభావతి మాట్లాడుతూ మహిళలు రాజకీయంగా ముందుకు నడవడానికి జనసేన పార్టీ ఒక గొప్ప వేదిక అని, సమాజంలో ఉన్న సమస్యలపై రాజకీయ అవగాహన కలిగి ఉండాలని అన్నారు.

రంగ వల్లికల పోటిలో పాల్గోన్న మహిళలందరికి బహుమతులు అందజేసి నియెజకవర్గ ప్రజానీకానికి ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
