ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో అంత‌ర్జాతీయ యోగ దినోత్స‌వం

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: చందాన‌గ‌ర్ సూప‌ర్ విజ్ క‌ళాశాల ఆవ‌ర‌ణ‌లో సోమ‌వారం ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో అంత‌ర్జాతీయ యోగ దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా యోగా శిక్ష‌కులు వి.రామారావు అసోసియేష‌న్ స‌భ్యులు, ఔత్సాహికుల‌తో యోగ ఆవ‌శ్వ‌క‌త‌ను వివ‌రించి ఆస‌నాలు, ప్రాణాయామం చేయించారు. అనంత‌రం అసోసియేష‌న్ క‌న్వీన‌ర్ టి.రామ‌స్వామియాద‌వ్ మాట్లాడుతూ ప్ర‌తిఒక్క‌రికీ ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని అవలబింపజేయటానికి చేసే ప్రయత్నమే ఈ యోగా దినోత్సవం అని అన్నారు. మనసుని శరీరంను ఏకం చేయటమే యోగమ‌ని, యోగం అంటే కలయిక అని తెలిపారు. యోగా అనగా ఆసనాలు, ప్రాణయామం, ధ్యానం చేయ‌డం ద్వారా శ‌రీరం, మ‌న‌సు ఉల్లాసంగా ఉంటుంద‌ని తెలిపారు. ధ్యానం వలన మానసిక రుగ్మతలు తగ్గి మానసిక ప్రశాంతత ఏర్పడతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రామ్మోహనరావు , సుధాకర్ , యోగా టీచర్ నాగమణి , జనార్దన్ , విష్ణుప్రసాద్ , వాణిసాంబశివరావు , సురేష్ బాబు , పొలా కోటేశ్వరరావు గుప్తా , విజయలక్ష్మి , రజని తదితరులు పాల్గొన్నారు.

యోగా ఆస‌నాలు వేస్తున్న ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ స‌భ్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here