గోప‌న్‌ప‌ల్లి ప్ర‌భుత్వ పాఠ‌శాల వ‌ద్ద జీబ్రా క్రాసింగ్ ఏర్పాటు చేయాలి

గ‌చ్చిబౌలి(న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గ‌చ్చిబౌలి డివిజ‌న్ ప‌రిధిలోని గోప‌న్‌ప‌ల్లి ప్ర‌భుత్వ పాఠ‌శాల వ‌ద్ద జీబ్రాక్రాసింగ్ ఏర్పాటు చేయాల‌ని కోరుతూ పాఠ‌శాల అధ్యాప‌కులు డివిజ‌న్ కార్పొరేట‌ర్ గంగాధ‌ర‌రెడ్డికి విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు. సోమ‌వారం కార్పొరేట‌ర్‌ను క‌లిసిన పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యాయులు, స్థానిక ప్ర‌జ‌లు ర‌హదారిపై జీబ్రాక్రాసింగ్‌, యుట‌ర్న్ ఏర్పాటు చేయాల‌ని కోరారు. పాఠ‌శాల స‌మీపంలో అంగ‌న్‌వాడీతో పాటు బ‌స్తీ ద‌వ‌ఖానా ఉన్నాయని మ‌హిళ‌లు, చిన్నారులు, వృద్దులు, విద్యార్థులు రోడ్డు దాటేందుకు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని తెలిపారు. సంబంధిత అధికారుల‌తో చ‌ర్చించి వెంట‌నే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని వారు కోరారు.

కార్పొరేట‌ర్ గంగాధ‌ర‌రెడ్డికి విన‌తిప‌త్రం అంద‌జేస్తున్న ప్ర‌భుత్వ పాఠ‌శాల సిబ్బంది
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here