నమస్తే శేరిలింగంపల్లి: సైబరాబాద్ కమీషనర్ వి.సి.సజ్జనార్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. కమీషనర్ సజ్జనార్, ట్రాఫిక్ అడీషనల్ కమీషనర్లు డిప్యూటి డిజిపి స్థాయికి పదోన్నతి పొందిన సందర్భంగా సోమవారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కెసిఆర్ను కలిసి పుష్ఫగుచ్చం సమర్పించి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇరువురికీ శుభాకాంక్షలు తెలిపారు.
