జీహెచ్ఎంసీ 2020 ఎన్నికల ఫలితాలు-మాదాపూర్ డివిజన్ 107 (మొద‌టి రౌండ్)

నమస్తే శేరిలింగంపల్లి: జిహెచ్ఎంసి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు తొలి రౌండ్ లో పోస్టల్ బ్యాలెట్లతో అధికారులు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. రౌండ్ కు 14 వేల ఓట్లను లెక్కించనున్నట్లు అధికారులు ప్రకటించడంతో ప్రక్రియ అంతా రెండు రౌండ్లలోనే పూర్తి కానుంది. మాదాపూర్ డివిజన్ నుండి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా, జగదీశ్వర్ గౌడ్, బీజేపీ అభ్యర్థిగా గంగల రాధాకృష్ణ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థి గా నగేష్, టీడీపీ అభ్యర్థి గా తన్నీరు ప్రసాద్ , స్వతంత్ర అభ్యర్థులు గా ఆరెపల్లి సాంబశివ రావు, షేక్ వహీద్ లు పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ డివిజన్ లో పోస్టల్ బ్యాలెట్లు 3 రాగా బిజెపికి రెండు, టిఆర్ఎస్ కు ఒకటి వచ్చాయి. 

తొలి రౌండ్ ముగిసే సరికి ఎన్నికల ఫలితాలు క్రింది విధంగా ఉన్నాయి.

టిఆర్ఎస్ -8888
బిజెపి-3855
కాంగ్రెస్-335
టిడిపి -605
ఆరెపల్లి సాంబశివరావు -07
షేక్ వహీద్-12

NOTA-68
చెల్లని ఓట్లు-224

మెజారిటీ-టిఆర్ఎస్ 5033

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here