చందానగర్(నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్, శేరిలింగంపల్లి గౌడ సంఘం అధ్యక్షులు పి.అశోక్గౌడ్ జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. చందానగర్లోని ఆయన నివాసంలో నిర్వహించిన ఈ వేడుకలకు శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీతో పాటు గౌడ సంఘం నాయకులు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరై అశోక్గౌడ్కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా అశోక్గౌడ్ను శాలువాతో సత్కరించి కేకు కట్ చేయించారు. అశోక్గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, హైదర్నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్, చందానగర్ డివిజన్ టిఆర్ ఎస్ అధ్యక్షులు రఘునాథ్రెడ్డి, బిజెపి రంగారెడ్డి జిల్లా ప్రధానకార్యదర్శి చింతకింది గోవర్ధన్గౌడ్, నాయకులు, డి.లక్ష్మీనారాయణగౌడ్, గాలి అనీల్కుమార్, లక్ష్మారెడ్డి, యాదగిరిగౌడ్, ఓం ప్రకాష్గౌడ్, కరుణాకర్ గౌడ్, సాయి కుమార్, వీర్ కుమార్ గౌడ్ పుట్టవినయకుమార్ గౌడ్లు ఉన్నారు.
