నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం లింగంపల్లి గ్రామంలో ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లను పరిష్కరించేందుకు.. శేరిలింగంపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ జనరల్ బాడీ మీటింగ్ను విజయవంతంగా నిర్వహించామని శేరిలింగంపల్లి గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు రవి యాదవ్ తెలిపారు. ఈ సమావేశానికి హాజరైన పెద్దలు, ఎస్ ఎల్ వీడిసి సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామాన్ని ప్రభావితం చేసే సమస్యలపై చర్చించడానికి జనరల్ బాడీ మీటింగ్ కల్పించిన సద్వినియోగం చేసుకున్నామని, ఇందులో మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, విద్య, సామాజిక సంక్షేమం వంటి కీలకమైన సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించడం, పరిష్కరించడంపై దృష్టి సారించామన్నారు. సనావేశానికి హాజరైన వారి విజ్ఞాన సంపద, అనుభవం తమ చర్చలను సుసంపన్నం చేశాయని పేర్కొన్నారు.