దుబ్బాక బిజేపి అభ్యర్థి రఘునందన్ రావును కలిసిన ఏకాంత్ గౌడ్

రఘునందన్ రావుతో మాట్లాడుతున్న ఉప్పల ఏకాంత్ గౌడ్

వివేకానంద నగర్ (నమస్తే శేరిలింగంపల్లి): వివేకానంద నగర్ డివిజన్ బిజెపి నాయకులు ఉప్పల ఏకాంత్ గౌడ్ దుబ్బాక ఉప ఎన్నికల బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు తో ఆదివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. డివిజన్ కు చెందిన ముఖ్యమైన నాయకులతో కలిసి దుబ్బాక వెళ్లిన ఏకాంత్ గౌడ్ రఘునందన్ రావు తో కలిసి స్థానికంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రఘునందన్ రావు గెలుపు కోసం తమ డివిజన్ లోని కార్యకర్తలందరూ పూర్తి స్థాయిలో పని చేసేందుకు సిద్ధమని ఏకాంత్ గౌడ్ పేర్కొన్నారు. ఇప్పటికే దుబ్బాక ప్రజలు గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న రఘునందన్ రావు భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

వివేకానంద నగర్ డివిజన్ నాయకులతో రఘునందన్ రావు, ఉప్పల ఏకాంత్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here