తారానగర్ లో కాంగ్రెస్ పార్టీ బస్తీ ఘోష

పారిశుధ్య కార్మికులను సన్మానిస్తున్న కొండా విశ్వేష్వర్ రెడ్డి, రవికుమార్ యాదవ్

పారిశుద్ధ కార్మికులను సన్మానించిన కొండా విశ్వేష్వర్ రెడ్డి, రవికుమార్ యాదవ్

శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): తారానగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బస్తీ ఘోష కార్యక్రమం నిర్వహించారు. చేవెళ్ల మాజీ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఏం.రవికుమార్ యాదవ్ లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మొదట తుల్జాభవాని ఆలయంలో పూజలు చేసిన నేతలు అక్కడే పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. అనంతరం తారా నగర్ లోని పురవీధుల్లో పర్యటించి స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్చర్ల ఎల్లేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు హబీబ్, రామ్ చందర్, బండి పాండు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

తారానగర్ లో నెలకొన్న సమస్యలను కొండా విశ్వేష్వర్ రెడ్డి, రవికుమార్ యాదవ్ లకు వివరిస్తున్న స్థానిక మహిళ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here